పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణం

జగన్ చేస్తున్న పనులను న్యాయస్థానాల ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Update: 2022-12-05 07:10 GMT

జగన్ చేస్తున్న పనులను న్యాయస్థానాల ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమకు చంద్రబాబు మేలు చేయకపోగా అడ్డుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకూ తన సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు పగటి కలల్లో కంటున్నారని, అది ఆయనకే నష్టమని అన్నారు.

సీమకు ఎవరు ఏం చేశారో?
సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారన్నారు. పోలవరం తానే కనుగొన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను ఎవరూ నమ్మరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు నిర్వాకం కారణంగానే పోలవరం ఆలస్యం కావడానికి కారణమని సజ్జల తెలిపారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో పోలవరానికి శాపంగా మారిందన్నారు. జగన్ హయాంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని సజ్జల అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News