ఓటీఎస్ పై బాబుది దుష్ప్రచారం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2021-12-06 08:57 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పేదల కోసం తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఓటీఎస్ ను ఎవరూ బలవంతం చేయడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమకు ఇష్టమైతేనే ఇళ్లను రెగ్యులరైజ్ చేసుకోవవచ్చన్నారు. చంద్రబాబుకు వయసు మీద పడ్డ కొద్దీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఉద్యోగుల డిమాండ్లను...
ఉద్యోగులు ప్రజల్లో భాగమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వారి ఆందోళన సహేతుకమేనని, వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. కరోనా తో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉద్యోగులు కూడా ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.


Tags:    

Similar News