18 స్థానాలకు రాజీనామా చేయండి

ముఖ్యమంత్రి జగన్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Update: 2021-11-17 12:55 GMT

ముఖ్యమంత్రి జగన్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతుండబట్టే ఈ విజయాలు వైసీపీకి అందుతున్నాయని చెప్పారు. కుప్పంలో వైసీపీిని గెలిపించినందుకు సజ్జల రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు జగన్ పాలనను చూసే ఓట్లేశారన్నారు.

ఉప ఎన్నికలకు....
ముప్ఫయి ఏళ్లలో చంద్రబాబు కుప్పంకు ఏం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పైగా టీడీపీ నేతలు తమ బలం పెరిగిందని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే మరోసారి ఉప ఎన్నికలకు తాము సిద్దమని సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.


Tags:    

Similar News