శ్రీవారి భక్తులకు శుభవార్త.. సర్వదర్శనం టిక్కెట్ల విడుదల

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చేసింది.

Update: 2021-11-27 03:59 GMT

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చేసింది. సర్వదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. డిసెంబరు నెలకు సంబంధించి టీటీడీ ఈ టిక్కెట్లను విడుదల చేసింవది. రేపు ఉదయం 9 గంటలకు అద్దె కోటాలో గదులన కూడా విడుదల చేయనుంది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో ఈ టిక్కెట్లను విడుదల చేసింది. రోజుకు పది వేల టిక్కెట్లను విడుదల చేయనుంది.

రికార్డు స్థాయిలో...
తిరుమలను దర్శించుకునే వారు ఖచ్చితంగా ఆన్ లైన్ లోనే సర్వదర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గదులను కూడా అదే పద్ధతిలో బుక్ చేసుకోవాలి. ప్రతి నెల కోటా కింద భక్తులకు ఆన్ లైన్ లో టీటీడీ టిక్కెట్లను విడుదల చేస్తుంది. డిసెంబరు నెల కోటా టిక్కెట్లను నేడు విడుదల చేసింది. 19 నిమిషాల్లోనే 2.80 మంది లక్షల భక్తులు టిక్కెట్లను పొందారు. డిసెంబరు నెలకు 3.10 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది.


Tags:    

Similar News