సాయితేజ అంత్యక్రియలు రేపు

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయానికి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

Update: 2021-12-11 09:05 GMT

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయానికి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. సాయి తేజ భౌతిక కాయం బెంగళూరు ఎయిర్ బేస్ కు చేరుకుంది. అయితే సాయితేజ కుటుంబ సభ్యులు తమకు భౌతిక కాయాన్ని రేపు అప్పగించాలని, రేపు మాత్రమే తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

కుటుంబ సభ్యుల....
దీంతో సాయితేజ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆర్మీ అధికారులు రేపు భౌతిక కాయాన్ని చిత్తూరు జిల్లాకు తేనున్నారు. అధికారిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.


Tags:    

Similar News