గుంటూరు ఘటనకు ఆ పోస్టుతో సంబంధం

గుంటూరు ఘటనకు వైసీపీయే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు

Update: 2023-01-02 12:14 GMT

గుంటూరు ఘటనకు వైసీపీయే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబరు 20న జగనన్న సైన్యం సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందన్నారు. నిన్నటి గుంటూరు ఘటనక, ఆపోస్టుకు సంబంధం ఉందని దేవినేని ఉమ ఆరోపింాచరు.

పోలీసుల అనుమతితోనే....
నిన్న గుంటూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్న దేవినేని ఉమ, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.పోలీసుల అనుమతి తీసుకునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనక వైసీపీ హస్తం ఉందని ఆయన పునరుద్ఘాటంచారు.


Tags:    

Similar News