నేడు వైఎస్ వర్థంతి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది.

Update: 2022-09-02 02:27 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ ఇడుపుల పాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇందుకోసం అనేక నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నేతలు నిర్వహిస్తున్నారు.

సేవా కార్యక్రమాలతో...
వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నేతలు ఘన నివాళులర్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు రక్తదానం చేయాలని నిర్ణయించారు. మరోవైపు పేదల కోసం అన్నదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి తమ దివంగత నేత వైఎస్సార్ ను స్మరించుకోనున్నారు.


Tags:    

Similar News