సుప్రీంకోర్టుకు రాజధాని రైతులు

ఆర్5 జోన్‍పై నేడు సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించనున్నారు. స్పెషల్ లీవ్ పిటీషన్‌ను రైతులు వేయనున్నారు

Update: 2023-05-06 06:31 GMT

ఆర్5 జోన్‍పై నేడు సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించనున్నారు. స్పెషల్ లీవ్ పిటీషన్‌ను రైతులు వేయనున్నారు. హైకోర్టు జీవో నెంబరు 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దంటే ఎలా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఆర్‌5 జోన్‌పై...
ఈ నేపథ్యంలో దీనిపై రాజధాని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నారు. ఎస్‍ఎల్‍పీలో న్న జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ కానున్నారు. ఆర్5 జోన్‍లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలిస్తే అన్యాయం జరుగుతుందని శ్రవణ్ కుమార్ వాదించనున్నారు. రాజధాని ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని తెలపనున్నారు. సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా జడ శ్రవణ్ కుమార్ వాదనలను వినిపించనున్నారు.


Tags:    

Similar News