నేడు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్ల చర్చలు

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై నేడు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు చర్చలు జరపనున్నారు

Update: 2021-12-28 02:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై నేడు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు చర్చలు జరపనున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల తగ్గింపు, అధికారుల దాడులతో హడలెత్తిన సినిమా థియేటర్ల యాజమాన్యం తమ సినిమా హాళ్లను మూసివేసుకుంది. దాదాపు 175 సినిమా థియేటర్లను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మూసివేశారు.

థియేటర్ల మూసివేత పై....
ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రభుత్వం కూడా కొంత దిగివచ్చే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో మంత్రి పేర్ని నానితో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. తాము ఏ పరిస్థితుల్లో సినిమా థియేటర్ ను మూసివేశారో మంత్రి పేర్నినానికి చెప్పనున్నారు.


Tags:    

Similar News