Breaking : బ్యాడ్ న్యూస్.. డీఎస్సీ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-03-30 13:03 GMT

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ డీఎస్సీని వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. ఏపీ టెట్ ఫలితాలను కూడా వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర అధికారులకు ఆదేశించారు.

టెట్ ఫలితాలను కూడా...
6,100 టీచర్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింద.ి టెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత వారిని కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకూ డీఎస్పీ పరీక్షలు వాయిదా వేయాలని కేంద్రఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News