నాటు బాంబును కొరికిన శునకం

నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న బస్టాండ్ వద్ద దుకాణాల మధ్యలోంచి భారీ శబ్దం రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Update: 2022-01-28 10:30 GMT

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో హృదయ విదారకమైన ఘటన జరిగింది. స్థానికంగా నాటు బాంబు కలకలం రేగగా.. ఓ శునకం ఆ బాంబుకు బలైంది. అడవి పందులకోసం ఉపయోగించే నాటుబాంబును శునకం నోటితో కొరకడంతో.. ఆ బాంబు పేలి.. శునకం తల ఛిద్రమై దుర్మరణం చెందింది. ఈ ఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో శాంతిపురం పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో జరిగింది.

నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న బస్టాండ్ వద్ద దుకాణాల మధ్యలోంచి భారీ శబ్దం రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏమైందా అని చూసేసరికి.. ఓ శునకం చనిపోయి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో మరిన్ని నాటుబాంబులు ఉన్నాయా..? అన్న అనుమానంతో సోదాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Tags:    

Similar News