తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ నేడు ప్రారంభమయింది. ఒకటో తేదీ కావడంతో తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది.

Update: 2022-09-01 03:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ నేడు ప్రారంభమయింది. ఒకటో తేదీ కావడంతో తెల్లవారు జామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 62.69 లక్షల మంది పింఛనర్లకకు పంపిిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 1,594 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

వాలంటీర్లు ఇంటికి వెళ్లి....
ఉదయం నుంచే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 7.30 గంటలకే 36.74 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. మొత్తం 23.07 లక్షల మంది పింఛనుదారులకు 585,58 కోట్ల రూపాయలను పంపిణీ చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.


Tags:    

Similar News