Tirumala : నేడు తిరుమలలో రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

Update: 2024-03-11 01:48 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. పరీక్షల సమయం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తులు పెద్దగా వేచి ఉండకుండానే సులువుగానే స్వామి వారి దర్శనం దొరుకుతుంది. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

పన్నెండు గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పన్నెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,213 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,477 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చింది అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News