Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఇలాగా?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2024-04-30 03:06 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. సహజంగా సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లోనే ఎక్కువ రద్దీ ఉంటుందని చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే...
ఈరోజు వైకుంఠం కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,673 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,607 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News