Tirumala : బోసిపోయిన తిరుమల వీధులు.. తక్కువ మంది భక్తులతో

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వారం మధ్యలో ఉండటంతో భక్తుల రద్దీ అంతగా లేదు

Update: 2024-03-28 02:39 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వారం మధ్యలో ఉండటంతో భక్తుల రద్దీ అంతగా లేదు. క్యూ లైన్లలో కూడా భక్తులు పెద్దగా కనిపించడం లేదు. తిరుమల వీధుల్లోనూ భక్తులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. భక్తులు వీకెండ్ లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో వస్తారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఆదాయం మాత్రం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,097 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 24,453 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరులమ శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈరోజు తిరుమలలో తొమ్మిది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News