Tirumala : తిరుమలలో నేడు భక్తుల సంఖ్య సాధారణమే.. కారణమిదే

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడం, పరీక్షల సీజన్ కావడంతో పెద్దగా భక్తులు తిరుమలకు రావడం లేదు

Update: 2024-03-13 01:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడం, పరీక్షల సీజన్ కావడంతో పెద్దగా భక్తులు తిరుమలకు రావడం లేదు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో తిరుమలలో పెద్దగా వేచి ఉండగానే భక్తులకు స్వామి వారి దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు రెండు గంటల్లోగా దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

క్యూ కాంప్లెక్స్‌లోని...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,110 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,445 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News