Tirumala : నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ నిల్... నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది. నేరుగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది
tirumala darshan timings
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది. నేరుగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఇన్ని రోజులు భక్తులతో కిటకిటలాడిన తిరుమల కొండ గత రెండు రోజుల నుంచి భక్తుల లేక వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొన్నటి వరకూ దసరా పండగ సెలవులతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కానీ ఇప్పుడు సెలవులు పూర్తి కావడంతో రద్దీ తక్కువగా ఉంది. దీంతో పాటు తుపానుల హెచ్చరికలతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. తిరుమలకు వెళ్లి చిక్కుకుపోతామోమోనని కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు రద్దు చేసుకుంటున్నారు. మరో తుపాను పొంచి ఉండటంతో భక్తులు సంఖ్య తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.