ఎస్.. ఇప్పుడు తిరుమల వెళ్లొచ్చు

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఆదివారం కూడా భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2023-05-21 02:04 GMT

rush in tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఆదివారం కూడా భక్తుల రద్దీ పెద్దగా లేదు. తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని తొమ్మిది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నడక దారిన వచ్చిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం సర్వదర్శనం క్యూ లైన్‌లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

తొమ్మిది కంపార్ట్‌మెంట్లలోనే...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయంలో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,297 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 37,392 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు ప్రకటనలో తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చిందని వెల్లడించారు.


Tags:    

Similar News