Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.

Update: 2024-04-22 01:44 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. నిన్న వీకెండ్ వరకూ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. కంపార్ట్‌మెంట్లలో ఎక్కువ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న వారు, వివాహాలు చేసుకున్న నూతన దంపతులతో మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది.

మూడు కంపార్ట్‌మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,366 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,375 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.38 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.


Tags:    

Similar News