నేడు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రద్దీ కొంత మేరకు తగ్గింది

Update: 2022-08-19 02:19 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రద్దీ కొంత మేరకు తగ్గింది. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి పోయి ఉన్నాయి. వీరికి శ్రీవారి దర్శనం అయ్యేందుకు ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 70,674 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,930 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.53 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపాుర.


Tags:    

Similar News