Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు..25న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

జనసేన నేత పవన్ కల్యాణ్ క్రిమినల్ కేసు నమోదయింది. 2023 జులై 9న వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేసింది

Update: 2024-02-18 02:43 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిమినల్ కేసు నమోదయింది. గత ఏడాది జులై 9న వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని పవన్ కల్యాణ్ కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరు కోర్టులో ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది.

ఈ సెక్షన్ల కింద....
దీంతో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ నెల 25న పవన్ కల్యాణ్ న్యాయస్థానానికి హాజరవుతారా? లేదా పై కోర్టుకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై పవన్ కల్యాణ్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News