ఏపీ కరోనా అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 26 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2022-03-14 13:23 GMT

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,18,884 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,03,607గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 547 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,32,67,581 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News