Tirumala : తిరుమలలో తగ్గని రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది.

Update: 2023-12-19 02:27 GMT

Tirumala

తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. క్రిస్మస్ సెలవులు కావడంతో అధిక మంది తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ ను కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 61,499 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,789 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు పన్నెండు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News