'ష‌ర్మిల‌'కు జ‌గ‌న్ సాయం

సీఎం జ‌గ‌న్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. మంగళవారం జిల్లా పర్యటన ముగించుకుని వెళుతున్న సందర్భంలో

Update: 2023-08-08 08:39 GMT

సీఎం జ‌గ‌న్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. మంగళవారం జిల్లా పర్యటన ముగించుకుని వెళుతున్న సందర్భంలో రాజమహేంద్రవరంకు చెందిన ఎస్కే అబ్దుల్ షుకుర్.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. తన కుమార్తె ఎస్కే షర్మిల(40) కీళ్ళ వాతం సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపి.. వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేమని ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించారు. షర్మిల స‌మ‌స్య‌ను విన్న సీఎం జ‌గ‌న్ వెంట‌నే స్పందించారు.


తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందించి పాపకు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు షర్మిలకు వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు చెక్కు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తన‌ కుమార్తె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి స్వయంగా  స్పందించి ఇచ్చిన హామీకి.. ముందస్తు భరోసాగా లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంపై సీఎం జగన్ కు అబ్దుల్ షుకుర్ కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News