శ‌భాష్‌.. ఎస్సైను మెచ్చుకున్న‌ సీఎం

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించారు.

Update: 2023-08-08 04:49 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. గత ఏడాది, ఈ సంవ‌త్స‌రం వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించిన కూనవరం ఎస్సైను సీఎం జగన్‌ అభినందించారు. హెలిపాడ్‌ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతున్న సందర్భంలో ఒక విజ్ఞాపనకోసం సీఎం బస్సుదిగారు. అదే సమయంలో అక్కడున్న స్థానికులు..అధికారులు బాగా పనిచేశారని సీఎంకు చెప్పారు. అదే సమయంలో స్థానిక ఎస్సై వెంకటేష్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సాహసోపేతంగా నిర్వహించారని.. గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారని స్థానికులు సీఎం ఎదుట మెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌ను సీఎం భుజం తట్టి, అభినందించారు. మెడల్‌ ఇవ్వాలంటూ సిఫార్సు చేశారు.


Tags:    

Similar News