లక్ష్మీనారాయణ కు నోటీసులు.. 13న హాజరు కావాల్సిందే

చంద్రబాబు సన్నిహితుడు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Update: 2021-12-10 13:32 GMT

చంద్రబాబు సన్నిహితుడు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా లక్ష్మీనారాయణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిన కేసులో లక్ష్మీనారాయణ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులుగా చేర్చింది.

సీఐడీ పోలీసుల సోదాలు...
ఈరోజు సీఐడీ పోలీసులు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు లో బీపీ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు షాబాద్ లోని గంటా సుబ్బారావు ఫాం హౌస్ లోనూ ఏపీ సీఐడీ సోదాలు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఇంటి నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.


Tags:    

Similar News