TDP : చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ ప్రారంభించింది

Update: 2024-05-05 11:57 GMT

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ ప్రారంభించింది. వైసీపీ కార్యాలయానికి చేరుకుని అందుకు సంబంధించిన ఆధారాలను వైసీపీ నేతలను కోరుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసులో సీఐడీ చంద్రబాబు ఏ1, నారా లోకేష్ ఏ2 గా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది.

ఫేక్ న్యూస్ ను...
ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేసినట్లు వైసీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో సీఐడీ చంద్రబాబు, లోకేష్ తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీ పైన కేసు నమోదు చేసింది.


Tags:    

Similar News