ఎవడ్రా మన గెలుపును ఆపేది : చింతమనేని

దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-04-22 07:49 GMT

దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా చింతమనేని ప్రభాకర్ బయలుదేరారు. భారీ ర్యాలీతో బయలుదేరిన ప్రభాకర్ తొలుత ఆంజనేయస్వామి, రాట్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

భారీ ర్యాలీగా...
దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ఈ ర్యాలీలో ప్రసంగించారు. మన గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News