రోశయ్య ఇంటికి కేసీఆర్

రోశయ్య పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Update: 2021-12-04 07:21 GMT

రోశయ్య పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అమీర్ పేట్ లోని రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేపు రోశయ్య పార్ధీవ దేహానికి అధికారికంగా అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కొంపల్లిలో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ మంత్రులందరూ రోశయ్యకు ఘన నివాళులర్పించారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోశయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో రోశయ్య కు ఘన నివాళులర్పించారు. ఎన్జీ రంగా శిష్యరికంలో రోశయ్య రాజకీయంగా ఎదిగారన్నారు. రోశయ్య రాజకీయ విలువలు కాపాడిన వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. రాజకీయంగా విభేదాలున్నా వ్యక్తిగతంగా సన్నిహితులమేనని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.


Tags:    

Similar News