చంద్రగిరి మండలం అభివృద్ధికి స్వర్ణగిరి చంద్రగిరి ప్రణాళిక
స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. గత ఏడాది సంక్రాంతికి కందులవారి పల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లికి కార్యక్రమానికి ఎంపిక చేశారు. స్వర్ణ నారావారి పల్లె ప్రాజెక్టు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతీ ఇంటికీ ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి.