Chandrababu : విధ్వంసమైన పాలనను గాడిలో పెడుతున్నాం
గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు
గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు. మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో మీ సహకారం కోరానన్నారు. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రయిక్ రేట్ తో అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు అరకు నుంచి ఉమ్మడి ప్రకాశం వరకూ ఒక్కసీటు కూడా వాళ్లకు రాలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లా అంతా కూటమిని వందశాతం గెలిపించాలని కోరారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగిస్తూ మార్కాపురం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా, అలాగే పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశామన్న చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాలు నీరు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాకే అవకాశం వచ్చిందని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రానికి చీకటి రోజులు. వెలిగొండ పనులు ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగరి లాంటి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలుకు కూడా నీళ్లు వెళ్తాయని చెప్పారు.