Chandrababu : అధికారంలోకి రాగానే ఆరువేల పింఛను

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నెలకు ఆరువేల రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

Update: 2024-04-08 11:23 GMT

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నెలకు ఆరువేల రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్తెనపల్లిలో దివ్యాంగులు సమస్యలపై వినతిపత్రం అందించారన్నారు. దివ్యాంగులకు నెలకు రు.6 వేల పింఛన్ ఇచ్చేందుకు తాను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులున్నా...
ఆర్థిక ఇబ్బందులున్నా పింఛన్ ఆరువేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏటా దివ్యాగుల ప్రతిభను గుర్తించేలా చేశామన్న చంద్రబాబు దివ్యాంగులకు టీడీపీ తెచ్చిన పథకాలను వైసీపీ రద్దు చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News