ఏపీకి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం : చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోనే యాభై ఏళ్లు క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభమైందని చంద్రబాబు తెలిపారు

Update: 2026-01-24 12:08 GMT

చిత్తూరు జిల్లాలోనే యాభై ఏళ్లు క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తునే ఉన్నానని, దావోస్ కు వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. గతంలో తాను టెక్నాలజీ అంటే అవహేళన చేశారని, ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపదను పెంచిందన్నారు. వచ్చే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుందన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యం కాపాడేలా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గతంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి నెలకొందని, ఇప్పుడు పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లపైనా, పొలాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

సంపద పెంపొందించేందుకు...
దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని, గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ లాంటి ఉత్పత్తి కూడా చేసే దిశగా అడుగులు వేశామని చంద్రబాబు అన్నారు. 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వినియోగించటం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్న చంద్రబాబు దీనికి శాశ్వతంగా పరిష్కరించేందుకు ఓ ప్రణాళికను తీసుకువస్తామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. 2024 వరకూ రాష్ట్రంలో భయంకరమైన సైకో, రాక్షస పాలన నడిచిందని, అక్రమ కేసుల్లో అరెస్టు చేసి కోర్టుకు కూడా వెళ్లకుండా తనను జైలుకు పంపించారని, సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి సంక్షేమాన్ని చేపడుతున్నామని, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తున్నామని, రాష్ట్రానికి ఈ పందొమ్మిది నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు చెప్పారు.








Tags:    

Similar News