నేడు ఉత్తరాంధ్రలో బీజేపీ పోరు యాత్ర

ఉత్తరాంధ్ర సాగు, తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ ఈ యాత్రను కొనసాగించనుంది.

Update: 2022-04-07 03:57 GMT

భారతీయ జనతా పార్టీ నేడు ఉత్తరాంధ్రలో పోరుబాట పట్టనుంది. ఉత్తరాంధ్ర సాగు, తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ ఈ యాత్రను కొనసాగించనుంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తి కావడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతుంది.

శ్రీకాకుళం నుంచి....
జలం కోసం ఉత్తరాంధ్ర జన పోరు యాత్రను నేటి నుంచి బీజేపీ ప్రారంభించనుంది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యే ఈ పోరు యాత్ర విశాఖ జిల్లాతో ముగియనుంది. మధ్యలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. ఈ సభలకు జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించింది. మాడుగుల నియోజకవర్గంలో చివరి బహిరంగ సభ జరగనుంది. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకూ తమ పోరు కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News