వైసీపీకి బీజేపీ ఆశీస్సులు ఏమీ లేవు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు

Update: 2021-12-04 14:04 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా వైసీపీకి ఎందుకు ఓటేశామా? అని లెంపలేసుకునే పరిస్థితికి వచ్చిందని సుజనా చౌదరి అన్నారు. ప్రతి పనిలో అవినీతి కన్పిస్తుందన్నారు.

తమకు రాజకీయ ప్రత్యర్థి.....
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గెలుపుకాదన్నారు. వాటిని అప్రజాస్వామిక పద్ధతుల్లో వైసీపీ గెలుచుకుందని సుజనా చౌదరి అన్నారు. వైసీపీ కి బీజేపీ పెద్దల ఆశీస్సులు లేవని సుజనా చౌదరి అన్నారు. వైసీపీ తమకు రాజకీయ ప్రత్యర్థి అని సుజనా చౌదరి అన్నారు.


Tags:    

Similar News