నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగింపు

నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది.

Update: 2021-11-26 02:08 GMT

నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ లో విక్రయించడం వంటి బిల్లులను తీసుకు వచ్చింది. దీంతో పాటు మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది. సీఆర్టీఏ చట్టం రద్దును కూడా వాపస్ తీసుకుంది. అలాగే శాసనమండలి రద్దు నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపింది.

రెండో రోజే రచ్చ....
అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభమయిన రెండో రోజే రచ్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారంటూ సభను బాయ్ కాట్ చేశారు. తాను సీఎం అయిన తర్వాతనే సభకు వస్తానని ప్రకటించి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యులు మాత్రం ఈ సమావేశాల వరకూ రెండు సభలను బహిష్కరిస్తున్నట్లు చెప్పాయి. ఈరోజు తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.


Tags:    

Similar News