ఈ సైకోగాళ్లను నడిరోడ్డు మీద ఉరితీయాల్సిందే

భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2025-04-11 06:56 GMT

భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్న షర్మిల ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని షర్మిల అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని, సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్న షర్మిల ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని కోరారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీలే నంటూ ధ్వజమెత్తారు.

సోషల్ మీడియా వేదికగా...
సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు వైఎస్ షర్మిల. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని, రక్త సంబంధాన్ని మరిచారని, రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని వైఎస్ షర్మిల అన్నారు. అన్నెంపుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారని, అక్రమ సంబంధాలు అంటగట్టారని, మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ ధ్వజమెత్తారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని వైఎస్ షర్మిల పిలుపు నిచ్చార.









Tags:    

Similar News