నేడు నంద్యాలకు జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.

Update: 2022-04-08 03:39 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. నంద్యాల ఎస్‌‌పీజీ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రెండో విడత వసతి దీవెన...
జగనన్న రెండో విడత వసతి దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1,024 కోట్ల రూపాయల నగదును జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10,68,150 మంది లబ్ది పొందనున్నారు. జగన్ నంద్యాల పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News