ముగిసిన బీఏసీ .. ఐదు రోజులు సభ

ఏపీ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించారు

Update: 2022-09-15 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ తరుపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలు, సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో చర్చించారు.

టీడీపీ 19 అంశాలను...
19 అంశాలను చర్చించాలని బీఏసీ సమావేశంలో టీడీపీ కోరింది. ఈ 19 అంశాలను సభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం 27 అంశాలపై చర్చించాలని నిర్ణయించింది. సభలో పెట్టాల్సిన బిల్లులపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన తర్వాత రెండు సార్లు టీడీపీ సభ్యుల ఆందోళన కారణంగా వాయిదా పడింది. కాసేపట్లో ప్రారంభమయ్యే సభలో జగన్ మూడు రాజధానులపై పవర్ పాయింట్ ప్రెజింటేషన్ ఇవ్వనున్నారని తెలిసింది.


Tags:    

Similar News