16 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల నుంచి టీడీపీకి చెందిన స‌భ్యులు స‌భ నుంచి స‌స్పెండ్ అయ్యారు.

Update: 2022-09-15 14:23 GMT

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల నుంచి టీడీపీకి చెందిన స‌భ్యులు స‌భ నుంచి స‌స్పెండ్ అయ్యారు. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీలో స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల‌ను ప్రారంభించ‌గా ఉద్యోగాలు ఇవ్వ‌ని జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై చ‌ర్చ‌కు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీక‌ర్ తిర‌స్క‌రించ‌గా చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని టీడీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. ఆ త‌ర్వాత కొంత‌సేప‌టికి స‌భలో అధికార వికేంద్రీక‌ర‌ణ‌పై వైసీపీ ప్ర‌తిపాదించిన స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌పై టీడీపీ, వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని వైసీపీ సభ్యులు ఆరోపించారు. కోర్టుల్లో వేసిన కేసుల‌ను ఎందుకు ఉప‌సంహ‌రించుకున్నార‌ని టీడీపీ నిల‌దీసింది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాద‌న తారస్థాయికి చేరుకోవడంతో మంత్రి బుగ్గన ప్ర‌తిపాద‌న మేర‌కు టీడీపీకి చెందిన స‌భ్యుల‌ను స్పీక‌ర్ ఒక రోజు పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా కొన‌సాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో.. కొంత‌సేపు స్పీక‌ర్ స్థానంలో క‌నిపించిన ర‌ఘుప‌తి ఆ త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ర‌ఘుప‌తి రాజీనామాను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వెంట‌నే ఆమోదించారు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన ర‌ఘుప‌తి ఎందుకు రాజీనామా చేశార‌న్న విష‌యం ఇంకా తెలియలేదు. ర‌ఘుప‌తి రాజీనామాతో ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఖాళీ అయ్యింది.


Tags:    

Similar News