ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం ..17 నుంచి?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది

Update: 2022-01-11 08:42 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానంలోనే కేసులను విచారించాలని నిర్ణయించింది. హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లోనూ ఈ విధానాన్ని అనుసరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆన్ లైన్ లోనే.....
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసులను ప్రత్యక్షంగా విచారణ చేపడితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని భావించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లోనే కేసుల విచారణ జరుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.


Tags:    

Similar News