జీవో నెంబరు 1 సస్పెన్షన్ : ఏపీ సర్కార్ కు షాక్

జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2023-01-12 11:59 GMT

జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ షోలు, రహదారులపై బహిరంగ సభలు పెట్టరాదంటూ ప్రభుత్వం జీవో నెంబరు 1 ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటీషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు.

ఈ నెల 20వ తేదీలోగా...
అయితే దీనిపై అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరుపున వాదనలను వినిపించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉందని తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. రోస్టర్ ప్రకారం ఈ పిటీషన్ రావాలని, ప్రభుత్వ విధానాలపై వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం లేదని అన్నారు. అయితే ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ వరకూ జీవోను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఈ నెల 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News