ఈ నెల 20న విశాఖకు గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20వ తేదీన విశాఖ పర్యటనకు వెళతారు

Update: 2022-02-18 04:28 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20వ తేదీన విశాఖ పర్యటనకు వెళతారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన విశాఖకు వెళ్లనున్నారు. ఈ నెల 20 వ తేదీన రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖకు రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ వెళ్లనున్నారు. ఈ నెల 21వ తేదీన నావల్ డాక్ యార్డులో జరిగే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో గవర్నర్ హరిచందన్ పాల్గొననున్నారు.

రాష్ట్రపతికి...
ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడకు రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ విశాఖ పర్యటనకు వెళుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News