ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.. ఈరోజు కొత్తగా ఏపీలో 615 కొత్త కేసులు నమోదయ్యాయి

Update: 2022-02-15 12:52 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.. ఈరోజు కొత్తగా ఏపీలో 615 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా నలుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,13,827 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,702 మంది మరణించారు.

పరీక్షల సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,86,575 గా ఉంది. 12,550 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,28,69,245 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 108 కేసులు నమోదయ్యాయి. అయితే పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం కూడా కేసులు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఈరోజు 15,193 మంది శాంపిల్స్ ను మాత్రమే పరీక్షించింది.

Tags:    

Similar News