నేడు ఎమ్మెల్యేలతో జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతున్నారు

Update: 2022-07-18 03:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. గత నెలలో ఒకసారి ఈ వర్క్ షాప్ జరిగింది. మరోసారి ఈ వర్క్ షాప్ ను నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు హాజరు కానున్నారు.

గడప గడపకు ప్రభుత్వం....
ఈ ఏడాది ఏప్రిల్ నెల 11వ తేదీన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఇంటింటికీ వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తుండగా, మరికొందరు కార్యక్రమాన్ని చేయడం లేదు. తమ అనుచరులతో చేయించి మమ అనిపిస్తున్నారు. దీనిపై జగన్ ఈరోజు ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో క్లాస్ పీకే అవకాశముంది.


Tags:    

Similar News