నేడు ఢిల్లీలో కీలక సమావేశం

నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది

Update: 2022-08-25 03:54 GMT

నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

మోదీ ఆదేశం మేరకు...
ప్రధాని మోదీ ఆదేశం మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ తరుపున విజయసాయిరెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి హాజరు కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నార్త్ బ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.


Tags:    

Similar News