ప్రయివేటు బస్సులో మంటలు

ఒక ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

Update: 2021-12-16 04:08 GMT

ఒక ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారి బస్సులో మంటలు చెలరేగాయి. ప్రకాశం జిల్లా తిమ్మరాజు పాలంె వద్ద ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు నుంచి బయటపడ్డారు.

ప్రయాణికుల సామాగ్రి....
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ణ్నారు. ఈ ఘటనలో ప్రయాణికుల సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.


Tags:    

Similar News