కనకదుర్గమ్మకు కానుకగా 2 కోట్ల ఆభరణాలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో కూడిన బంగారపు ఆభరణాలను కానుకగా కీర్తిలాల్ జ్యూయలరీ నిర్వాహకులు అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో కూడిన బంగారపు ఆభరణాలను కానుకగా కీర్తిలాల్ జ్యూయలరీ నిర్వాహకులు అందజేశారు. సూర్య చంద్రుల ఆభరణాలు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, సూత్రాలు, గొలుసు, కంఠాభరణాలను దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనానాయక్లకు ఆలయ ప్రాంగణంలో ఇచ్చారు. 531 గ్రాముల బంగారం, వజ్రాలతో వాటిని తయారు చేయించారు.