Andhra Pradesh : ఏపీలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-10-31 03:15 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ సవరణ చట్టం- 2025' అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం అమలుతో ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం బిక్షాటన ను రాష్ట్రంలో రద్దు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

చట్టం రూపంలో....
ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు


Tags:    

Similar News