తిరుమలలో తగ్గని రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు.

Update: 2023-09-14 03:26 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు. సెలవులతో సంబంధం లేకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరడంతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లు నిండిపోయి భక్తులకు శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

పొరుగు రాష్ట్రాల...
ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఎక్కువగా వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టంబరు మాసంలో అయితే పెద్దగా రద్దీ ఉండదని భావించి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ మంది స్వామి వారి దర్శనానికి వస్తుండటంతో క్యూలైన్లన్నీ నిండిపోతున్నాయి. అధికారులు కూడా భక్తుల సంఖ్యకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
14 గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 75,059 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 27,411 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పన్నెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News